Thursday, 17 December 2020

అలీ అందుకే నిర్మాతగా మారాడా?


 టాలీవుడ్‌లో బ్రహ్మానందం తర్వాత స్టార్ కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది అలీనే. అతడు హీరోగానూ కొన్ని సినిమాలు చేసినా సునీల్ తరహాలో కాకుండా కమెడియన్‌గానూ సమాంతరంగా నటించాడు. అంతేకాకుండా బుల్లితెరపైనా అలీ తన హవా కొనసాగిస్తున్నాడు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమం ఎంతో పాపులారిటీ సాధించింది. ఎస్పీ బాలుతో ఇంటర్వ్యూ తర్వాత ఆ షో రేంజ్ పెరిగిందని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ మధ్య అతడికి సినిమాల్లో అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. ఓ సినిమా ఫంక్షన్‌లో అలీకి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని పోసాని వ్యాఖ్యలు దీనికి నిదర్శనం.

దీంతో అలీ నిర్మాతగా అవతారమెత్తాడు. ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనే పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తన స్నేహితుడు శ్రీపురం కిరణ్‌ను దర్శకుడిగా మార్చి ఈ సినిమాను అలీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అలీతో పాటు సీనియర్ నరేష్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అలీ కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సి ఉంది.


No comments:

Post a Comment