Thursday, 17 December 2020

ఎన్టీఆర్‌కు జెమినీ టీవీ భారీ పారితోషికం


 జూ.ఎన్టీఆర్ యాంకర్‌గా మారి చేసిన బిగ్‌బాస్-1 షో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మరోసారి యాంకర్‌ పాత్ర పోషించబోతున్నాడు. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానుందని తెలిసిన విషయమే. రెండు నెలల్లో ఈ షో చిత్రీకరణ ప్రారంభం కానుంది. క్విజ్ మాదిరిగా ఉండనున్న ఈ షోకు జూ.ఎన్టీఆర్ భారీ పారితోషికం తీసుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది.

60 ఎపిసోడ్లుగా ఈ క్విజ్ షోను నిర్వాహకులు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ.18 కోట్లు ఎన్టీఆర్‌కు అందనున్నాయి. తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు ఏ నటుడికి ఇంత పారితోషికం అందలేదని టీవీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఈ షో వల్ల ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆలస్యమయ్యే అవకాశముంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


No comments:

Post a Comment